ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థుల ప్రాణాలు పోతే సీఎం తిరిగి తెచ్చిస్తారా..? : జవహర్

పరీక్షల పేరుతో.. ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలు పోతే సీఎం తిరిగి తెచ్చిస్తారా అని ప్రశ్నించారు. మంత్రి ఆదిమూలపు సురేష్.. తాడేపల్లి రాజసౌధం ఆదేశాలు అమలు చేసే ఉత్సవ విగ్రహం మాత్రమే అని దుయ్యబట్టారు.

By

Published : Apr 28, 2021, 4:11 PM IST

ex minister jawahar fires on cm jagan
ex minister jawahar fires on cm jagan

సీఎం జగన్ తన పట్టుదల, పంతం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటున్నారని మాజీమంత్రి, తెదేపా నేత జవహర్ ధ్వజమెత్తారు. విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలు పోతే జగన్ తిరిగి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. నారా లోకేశ్ పరీక్షలు వాయిదా వేయాలని కోరినందుకే.. వినకూడదనే మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. తాడేపల్లి రాజసౌధం ఆదేశాలు అమలు చేసే ఉత్సవ విగ్రహం మాత్రమే అని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details