ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి తిరుమలలో దర్శనాలు పునరుద్ధరణ

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాలు అనంతరం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణస్థాయికి చేరింది. అన్నిరకాల దర్శనాలను పునరుద్ధరించారు. రేపట్నుంచి నుంచి దివ్యదర్శనం, సమయ నిర్దేశిత దర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు.

By

Published : Oct 9, 2019, 12:46 AM IST

Updated : Oct 9, 2019, 3:15 AM IST

రేపటి నుంచి తిరుమలలో అన్ని రకాల దర్శనాలు పునరుద్ధరణ

తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. అంగరంగ వైభవంగా తిరుమాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగిన దేవేరుల సమేత స్వామి భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాలకు సుమారు 7 లక్షల మంది భక్తులు హాజరయ్యారని తితిదే అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ముగింపు అనంతరం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరింది. స్వామి వారి అన్ని రకాల దర్శనాలు పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి స్వామి దివ్యదర్శనం, సమయ నిర్దేశిత దర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు.

Last Updated : Oct 9, 2019, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details