ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలకు భారీగా భక్తజనం.. సర్వదర్శనానికి 26 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది.

By

Published : Aug 11, 2019, 7:48 AM IST

Updated : Aug 11, 2019, 9:53 AM IST

tirumala

శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90, 623 మంది భక్తులు దర్శించుకోగా...హుండీ ఆదాయం 2.61 కోట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ఇవాళ భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు.

శ్రీవారి సేవలో ఉప సభాపతి

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ఉప సభాపతి కోన రఘుపతి, మంత్రి జయరాం దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి

నేటి నుంచి శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలు

Last Updated : Aug 11, 2019, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details