ఆంధ్రప్రదేశ్

andhra pradesh

REMAND: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

By

Published : Jul 1, 2022, 12:45 PM IST

MLC Ananthababu Remand: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్​ను మరో 15 రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలిచ్చింది.

YCP MLC
YCP MLC

REMAND: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు.. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్​ను మరో 15 రోజుల పాటు పొడిగించారు. నేటితో రిమాండ్​ ముగియడంతో పోలీసులు ఎస్కార్ట్​ సాయంతో అనంతబాబును కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్​ గడువు పెంచడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను.. గత నెల 17న కోర్టు కొట్టి వేసింది.

ఎస్పీ చెప్పింది ఇదీ: ఈ నెల 19న రాత్రి 8.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం ఆయన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకొచ్చారు. కొండయ్యపాలెంలోని నవభారత్‌ స్కూల్‌ ప్రాంగణంలో రాత్రి 10.15 వరకూ మద్యం తాగారు. ఆ సమయంలో కారులో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చూసి తనతోపాటు వాహనంలో తీసుకెళ్లారు.

అనుమానం ఇదీ: ఎస్పీ వాదనకు పూర్తి భిన్నంగా మృతుడి భార్య అపర్ణ వాదన ఉంది. ‘ఎమ్మెల్సీ అనంతబాబు పుట్టినరోజు నాలుగు నెలల కిందటే అయిపోయింది. అయినా తన పుట్టినరోజని చెప్పి 19న నా భర్తను ఇంటి నుంచి అనంతబాబు తీసుకెళ్లారు. ఆయన రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి నా భర్తకు తెలుసు. అందుకే చంపేసి శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు’ అని వాపోయారు. పోలీసులు ఆ వాదనను పట్టించుకోలేదు. పోలీసులు చెబుతున్నదే నిజమనుకున్నా... సుబ్రహ్మణ్యం ఉన్న వైపే అనంతబాబు కారు వెళ్లటం, అతన్ని చూడటం కాకతాళీయమా? పథకం ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details