ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏపీ ప్రభుత్వం ఖండించకపోవటం దుర్మార్గం'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు హుందాగా లేవని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఆయన మాటల్ని ఖండించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

By

Published : Mar 27, 2021, 8:25 PM IST

గోరంట్ల బుచ్చయ్యచౌదరి
గోరంట్ల బుచ్చయ్యచౌదరి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఏపీ ప్రభుత్వం ఖండించకపోవటం దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ''గతంలో ఏపీలో ఒక ఎకరం అమ్మితే.. తెలంగాణలో మూడు ఎకరాల వచ్చేవని.. ఇప్పుడు అది రివర్స్ అయింది'' అనే కేసీఆర్ మాటలు హుందాగా లేవని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు విన్నారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details