ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VATSALYA : నిరాదరణకు గురైన చిన్నారులకు ఆశ్రయం... వాత్సల్య ప్రాంగణం...

నిరాధరణకు గురైన చిన్నారులను చేరదీసి, విద్యాబుద్ధులు నేర్పించే ఆశ్రమం అది. జీవితంపై ఆశ కల్పించి, సమాజంలో ఎలా మెలగాలో నేర్పించే వేదిక అది. ఈ ఆశ్రమంలో చదువుకున్న ఎందరో... పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఇంతకీ ఆ ఆశ్రమం ఏమిటి..?, ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా.. ? అయితే ఈ కథనం చదివేయండి మరి...

By

Published : Aug 26, 2021, 10:26 PM IST

నిరాదరణకు గురైన చిన్నారులకు ఆశ్రయం... వాత్సల్య ప్రాంగణం...
నిరాదరణకు గురైన చిన్నారులకు ఆశ్రయం... వాత్సల్య ప్రాంగణం...

నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం రోడ్డులో ఉన్న జనహిత వాత్సల్య ప్రాంగణం.. 35ఏళ్లుగా అనేక మంది దాతలు సహకారంతో కొనసాగుతోంది. ఈ నిధుల సహాయంతో నిరాదరణకు గురైన చిన్నారులకు విద్యాబోధన, వృద్ధాశ్రమం, దేవాలయం నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. ఆడపిల్లలకు వివాహం కూడా చేయిస్తున్నారు. సంగమేశ్వర శాస్త్రి స్థాపించిన ఈ ప్రాంగణంలో చదువుకున్న వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడ్డారు.

వాత్సల్య నిర్వాహకులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించకుండా... కేవలం దాతలు ఇచ్చే నిధులతో ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ ప్రాంగణంలో 130మంది ఆశ్రయం పొందుతున్నారు. వారి చదువుకు అయ్యే ఖర్చును సైతం ఆశ్రమం నిర్వాహకులే భరిస్తున్నారు. తల్లితండ్రులు లేరనే భావన రాకుండా అందరినీ సమానంగా చూస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీచదవండి.

మిద్దెతోటల పెంపకం... సమస్యల పరిష్కారానికి వేదికగా సామాజిక మాధ్యమం

ABOUT THE AUTHOR

...view details