నగరంలోని లాక్డౌన్ నిబంధనలను నగర పాలక సంస్థ అధికారులు సడలించారు. నిత్యావసర సరుకులు అమ్మే వ్యాపారులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపారం నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.
కొవిడ్ నిబంధనలు అందరూ తప్పకుండా పాటించాలని వ్యాపారులకు సూచించారు. ఈ సడలింపులపై కిరాణా దుకాణాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.