ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోదావరి డెల్టాలోని ఖరీఫ్ పంటలకు సీలేరు నీరు

గోదావరిలో నీరు లేక నదీ పరివాహక ప్రాంతాల్లో పంటల దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. రుతుపవనాలు ఆలస్యమైనందున ఖరీఫ్ పంటల కోసం 7 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి డెల్టాకు సీలేరు నుంచి విడుదల చేశారు.

By

Published : Jun 24, 2019, 8:40 AM IST

గోదావరి డెల్టాకు సీలేరు

రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యమైనందున గోదావరికి నీటి తాకిడి లేదు. ఇప్పటి దాకా నదిలో ఉన్న నీటిని ఖరీఫ్ నారుమళ్లకు విడుదల చేశారు. దీని వల్ల ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పడిపోయింది. ఇన్​ఫ్లో నిలిచి పోయి సీలేరు జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి డెల్టాలో రబీ కోసం ప్రతి ఏటా సీలేరుపై ఆధారపడడం తప్పనిసరి. అయితే ఖరీఫ్​కు మాత్రం మొట్టమొదటిసారిగా సీలేరు నుంచి నీరును విడుదల చేస్తున్నారు.

గోదావరి డెల్టాకు సీలేరు నీరు
రైతుల డిమాండు మేర‌కు జ‌ల‌వ‌న‌రుల శాఖ ఉన్న‌త‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిపి గోదావ‌రి డెల్టాలోని ఖ‌రీఫ్ పంట‌లు కోసం డొంక‌రాయి జ‌లాశ‌యం నుంచి 3వేల క్యూసెక్కులు, విద్యుదుత్ప‌త్తి అనంత‌రం 4వేల క్యూసెక్కుల నీరు విడుద‌ల చేస్తున్నారు. రోజువారి నీటి ల‌భ్య‌త‌పై జెన్‌కో అధికారులు స‌మీక్ష చేస్తూ నీటిని విడుద‌ల చేస్తున్నారు. సీలేరు ఎగువ ప్రాంత‌మైన బ‌లిమెల జ‌లాశ‌యంలో 6 టీఎంసీలు, డొంక‌రాయి జ‌లాశ‌యంలో 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ABOUT THE AUTHOR

...view details