ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2020, 10:00 AM IST

ETV Bharat / city

ఉన్న రాష్ట్రం పొమ్మంటున్నా.. సొంత రాష్ట్రం వద్దంటోంది!

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉత్తర ప్రదేశ్ వలస కూలీల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మగ్గం పనులు, పానీ పూరీ అమ్మకాల కోసం వలస వచ్చిన కుటుంబాలు కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో సుమారు 250 వరకు ఉన్నాయి. రాష్ట్రం ప్రభుత్వం వీరిని పంపించేందుకు సిద్దంగా ఉన్నా... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాక ఇక్కడే ఉంటున్నారు.

migrate workers of uthharpradesh facing problems in cadapa dst
migrate workers of uthharpradesh facing problems in cadapa dst

కడప జిల్లా రాజంపేటలో ఉత్తరప్రదేశ్ వలస కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేక యజమానుల ఒత్తిడి తట్టుకోలేక అద్దె ఇళ్ళను ఖాళీ చేయాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల క్రితం ఉత్తర ప్రదేశ్ కు పంపించడానికి తహసిల్దార్ రవిశంకర్ రెడ్డి రాజంపేట ప్రాంతంలో 180 మందికి, నందలూరు కు చెందిన మరో 20 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరినీ ప్రత్యేక రైళ్లల్లో ఉత్తర ప్రదేశ్ కు తరలించడానికి సిద్ధంగా ఉన్నా.. అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదని తహసిల్దార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details