ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ అమ్మిరెడ్డి

By

Published : Feb 25, 2021, 10:31 PM IST

గుంటూరు జిల్లాలో కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్​ను ఆదేశించారు.

sp ammireddy
కిడ్నాప్​కు గురైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ అమ్మిరెడ్డి

గుంటూరు జిల్లా నంబూరు యానాది కాలనీలో కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. బుధవారం బాలుడు కిడ్నాప్​కాగా.. అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపహరణ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆందోళనకు గురికావద్దని బాలుడి తల్లిదండ్రులకు .. ఎస్పీ హామీ ఇచ్చారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్​ను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details