ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా రౌండప్: జిల్లాలో కొత్తగా 539 కేసులు... 4 మరణాలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 36వేల 882కు చేరుకుంది. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 369 కి చేరింది. మృతుల సంఖ్యలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది.

By

Published : Aug 30, 2020, 10:15 PM IST

corona positive cases
corona positive cases

గుంటూరు జిల్లాలో కొత్తగా 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 36వేల 882 కు చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని 27వేల 341మంది ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో ఇవాళ కొత్తగా 4 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 369 కి చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 129 ఉన్నాయి. ఇక మండలాల వారీగా చుస్తే తెనాలి-66, మాచర్ల-87, బాపట్ల-39, సత్తెనపల్లి-32, ఫిరంగిపురం-25, తాడేపల్లి-19, కొల్లూరు-18, మంగళగిరి-17, పిడుగురాళ్ల-15, నరసరావుపేట-14, దుర్గి-12, రెంటచింతల-12 చొప్పున కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details