ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బాలు మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది'

By

Published : Sep 25, 2021, 10:59 AM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా గాన గంధర్వునికి తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నివాళులర్పించారు.

chandra babu, nara lokesh condolence on sp balu death anniversary
chandra babu, nara lokesh condolence on sp balu death anniversary

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధుర గాత్రం.. పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా గాన గంధర్వునికి నివాళులర్పించారు.

హృదయాల్లో సజీవంగానే..

ఎస్పీ బాలు రాగం, తానం, పల్లవి శ్వాసగా జీవించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పాట రూపంలో మన హృదయాల్లో సజీవంగానే ఉంటారన్నారు. ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

ఆ 'సినిమా' పాట.. ఎస్పీ బాలు.. జాతీయ అవార్డు

ABOUT THE AUTHOR

...view details