ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 16, 2020, 3:21 PM IST

Updated : Jul 16, 2020, 4:44 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 2,593 కరోనా కేసులు.. 24 గంటల్లో 40 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 2,593 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 2,593 కరోనా కేసులు

16:19 July 16

15:17 July 16

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

కరోనా బులెటిన్​

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,593 మందికి పాజిటివ్​ రాగా.. 40 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 38,044కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,304 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 2,584 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా వైరస్ సోకింది.

943 మంది కొవిడ్ ‌నుంచి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన బులెటిన్​ ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,453 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా 2,046 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో 432 మందికి కరోనా సోకగా 372 మంది డిశ్చార్జై, 60 మంది చికిత్స పొందుతున్నారు.                                                               

ఇదీ చూడండి..

కొవిడ్ చికిత్సల పర్యవేక్షణ బాధ్యతలు.. సీనియర్ ఐఏఎస్​లకు అప్పగింత

Last Updated : Jul 16, 2020, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details