ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2022, 8:58 PM IST

ETV Bharat / city

AP Top News: ప్రధాన వార్తలు @9PM

.

Topnews
Topnews

  • CM Jagan: మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్​
    మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని సీఎం జగన్ అన్నారు. దేశంలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మరెక్కడా లేరని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం జగన్​ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ కారణంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో సీఎం జగన్: చంద్రబాబు
    త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని.., వ్యతిరేకత ఇంకా పెరగవచ్చనే ఉద్దేశంతో ఎన్నికల యోచనలో జగన్ ఉన్నారన్నారు. మద్యపాన నిషేధం పేరిట నాసిరకం బ్రాండ్లు తెచ్చి.. మహిళల మంగళసూత్రాలు తెంచే జగన్‌కు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత లేదని దుయ్యబట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • suicide: "పోలీసుల భయంతో" తెదేపా కార్యకర్త ఆత్మహత్య!
    అధికార పార్టీ నేతలను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ ఓ తెదేపా కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, అధికార పార్టీ నాయకులు ఏం చేస్తారోననే భయపడి పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Botsa: 'ఆ మాటలు వ్యంగంగా చెప్పలేదు... చట్టంలో ఉన్నదే చెప్పాను'
    ఉమ్మడి రాజధానిగా 2024 వరకు హైదరాబాద్‌ను ఉపయోగించుకోవాలని విభజన చట్టంలో పొందుపరిచారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో వ్యంగం లేదని వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని బొత్స విమర్శించారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • గోవాలో మరోసారి 2017 సీన్ రిపీట్ కానుందా?
    గోవాలో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ తగ్గితే స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఎంజీపీ మద్దతు తీసుకుంటామని సావంత్​ చెప్పారు. ఈ క్రమంలో అప్రమత్తమైన కాంగ్రెస్​.. తమ పార్టీ అభ్యర్థులను క్యాంపునకు తరలించింది. అలాగే భాజపాయేతర పార్టీలతో చర్చలు జరుపుతోంది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇండియన్ ఆర్మీలో ఛాన్స్ మిస్​.. ఉక్రెయిన్​ సేనలో చేరి 'సైనికేశ్​' ఫైట్
    భారత సైన్యంలో చేరాలన్నది అతడి కల. రెండు సార్లు విఫలయత్నం చేశాడు. అంతటితో ఆగిపోలేదు. అమెరికా సైన్యంలో చేరేందుకు వివరాలు సేకరించాడు. అదీ సాధ్యం కాలేదు. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్​ సైన్యంలో చేరి రష్యాపై పోరాటం చేస్తూ తన కలను నెరవేర్చుకున్నాడు. అతనే.. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల సైనికేశ్​. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఉక్రెయిన్​లో బాంబుల మోత.. రష్యా దాడుల్లో 10 మంది మృతి
    ఉక్రెయిన్​పై రష్యా విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. బాంబులతో దాడులు చేస్తోంది. సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన లక్షిత దాడుల్లో 10 మంది పౌరులు మరణించారు. రెండు ఆయిల్ డిపోలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాణించిన ఐటీ, ఫార్మా షేర్లు.. సెన్సెక్స్ 580 ప్లస్
    అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 580 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి చెంది 16 వేల మార్క్ పైన స్థిరపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • వాళ్లే నా జీవితాన్ని నాశనం చేశారు: పూనమ్ కౌర్
    సినిమా ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేసినట్లు సినీనటి పూనమ్​ కౌర్​ ఆరోపించారు. మూడేళ్లుగా వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగానూ ఎంతో నష్టాన్ని అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆర్సీబీ కొత్త సారథి ఎవరో..? ఈసారైనా కప్పు కొట్టేనా..?
    జట్టులోకి ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు వచ్చి వెళ్లినా ఐపీఎల్ కప్పు అందుకోవడం మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అందని ద్రాక్షగానే ఉంది. ఈసారి కూడా పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మరి ఈ సారైనా ఆర్​సీబీ కల నెరవేరేనా..?పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details