ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 2:28 PM IST

ETV Bharat / city

వైకాపాది విధ్వంసకర పాలన: తెదేపా నేత పట్టాభిరామ్

వైకాపా పాలనపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. కేవలం కక్ష సాధింపు చర్యలపైనే దృష్టిసారిస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

Pattabhi Ram Kommareddy
Pattabhi Ram Kommareddy

రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. కక్షసాధింపు ధోరణితో ప్రజావేదికను జగన్ కూల్చివేయించారన్న ఆయన... వైకాపా ఏడాది పాలనంతా విధ్వంసాలు, కూల్చివేతలేనని ఆరోపించారు. ఏడాది కాలంలో ఒక్క నిర్మాణమైన జగన్ చేపట్టారా..? అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. 108 కుంభకోణాన్ని బయటపెడితే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్న పట్టాభి... న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించేందుకు వైకాపా యత్నం చేస్తోందని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details