ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AndhraPradesh: హైకోర్టు పరిధిలో మూడు రాజధానుల అంశం: కేంద్ర హోంశాఖ

By

Published : Jul 13, 2021, 9:39 PM IST

Updated : Jul 13, 2021, 10:33 PM IST

three capitals for ap
three capitals for ap

21:36 July 13

అప్పిలేట్‌ అథారిటీ దరఖాస్తు

మూడు రాజధానుల అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తులకు కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. 3 రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపింది. హైకోర్టులో విచారణలో ఉన్నందున సమాచారమివ్వడం కుదరదని వెల్లడించింది. దరఖాస్తును అప్పిలేట్‌ అథారిటీకి పంపుతున్నట్టు తెలిపింది.

గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. 

ఇదీ చదవండి

CM Jagan: 'పల్లెలు శుభ్రంగా ఉంటేనే..ప్రజలకు ఆరోగ్యం'

Last Updated : Jul 13, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details