ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 10:19 AM IST

ETV Bharat / city

నోటీసు ఇవ్వకుండా సబ్బం హరి ఇల్లు కూల్చేందుకు కుట్ర: లోకేశ్‌

నోటీసు ఇవ్వకుండా సబ్బం హరి ఇంటిని కూల్చడానికి కుట్ర పన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయడం సాధ్యం కాదని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

lokesh
lokesh

సీఎం జగన్ 'యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్'తో బాధపడుతున్నారని నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. విధ్వంసం.. ఈ వ్యాధి ప్రధాన లక్షణమని ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. కుట్రతోనే నోటీసు ఇవ్వకుండా సబ్బం హరి ఇంటి ప్రహారీని కూల్చారని ఆరోపించారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయడం సాధ్యం కాదనే విషయాన్ని సీఎం గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బంహరిపై కక్షసాధింపు చర్యలు సీఎం జగన్​ను మరింత దిగజార్చాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details