ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 17, 2020, 7:18 PM IST

ETV Bharat / city

తొలుత ఈడీ కేసులు విచారణ వద్దు.. జగన్​ అక్రమాస్తుల కేసులో వాదనలు

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ సాగింది. ఈడీ కేసులు ముందుగానే విచారణ జరపాలనే అంశంపై విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ప్రతాప్​ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ముందు సీబీఐ కేసులపై విచారణ జరపాలని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

jagan disproportionate assets cases
jagan disproportionate assets cases

జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ సాగింది. జగన్ కేసులో ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరించాలని నిమ్మగడ్డ ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు సీబీఐ, ఈడీ కోర్టు ఎన్‌బీడబ్ల్యూను ఉపసంహరించింది. ఈడీ కేసులు ముందుగా విచారణ జరపాలనే అంశంపై వాదనలు కొనసాగాయి. దీనిపై విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ప్రతాప్​రెడ్డి, శ్రీనివాస్​ అభ్యంతరం తెలిపారు. తొలుత ఈడీ కేసులు విచారణ చేయవద్దని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. జగన్​ కేసుల్లో ఈడీ కేసులపై తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేయగా... సీబీఐ ఛార్జ్‌షీట్లపై ఈ నెల 19న విచారణ జరపనుంది.

ABOUT THE AUTHOR

...view details