ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.

By

Published : Aug 21, 2019, 4:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్

తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మిలీషియా సభ్యుడు మృతి చెందాడు. ఘటనాస్థలంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు గుంటూరు రవిగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో మణుగూరు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనాస్థలానికి చేరుకుని మణుగూరు డీఎస్పీ సాయిబాబా, తహసీల్దార్ మనగిలాల్ పంచనామా చేశారు.

మావోయిస్టు పార్టీ విస్తరణ కోసం గుత్తి కోయ గ్రామాల్లో దళం తిరుగుతోందని ఎస్పీ సునీల్‌ దత్‌ తెలిపారు. కూబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టు తారసపడి కాల్పులు జరిపినట్లు చెప్పారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆత్మహత్య: భవిష్యత్తును ఉరితాడుతో బంధించింది

ABOUT THE AUTHOR

...view details