కొవిడ్ కారణంగా మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను జేసీబీ తొట్టెలో, పంచాయతీ చెత్త ట్రాక్టర్లో తరలించిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఘటనలపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. కొవిడ్ మృతుల పట్ల కేంద్ర హోంశాఖ జారీ చేసిన విధివిధానాలను ప్రభుత్వం యంత్రాంగం పాటించాల్సి ఉంది. కరోనా కారణంగా తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు కాసింతైన మానసిక తృప్తి లభించేలా మృతదేహాల అంత్యక్రియల్లో జాగ్రత్తలు చేపట్టాల్సిఉంది.
కరోనాతో మరణించిన వారి దహన సంస్కారాలకూ శ్మశానవాటికల్లో చోటు దక్కనిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా అపోహల కారణంగా ప్రభుత్వ సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరించటం పరిస్థితికి అద్దంపడుతోంది. కొవిడ్ కారణంగా మృతి చెందితే మృతదేహాల నిర్వహణ, తరలింపు, అంత్యక్రియలకు సంబంధించి ప్రత్యేకమైన మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది.
మృతదేహాల తరలింపు మార్గనిర్దేశాలు
- ఏకాంత గదిలో మరణిస్తే... మృతదేహాన్ని పరిశీలించేప్పుడు తడి అంటని యాప్రాన్, గ్లోవ్స్, మాస్క్లు ఉపయోగించాలి.
- మృతదేహానికి ట్యూబులు, డ్రైన్లు వంటివి ఉంటే తప్పనిసరిగా తొలగించాలి.
- దేహం నుంచి ద్రవాలేవీ బయటకు రాకుండా నోరు, నాసికారంధ్రాలు సరిగా మూసివేయాలి.
- మృతదేహాన్ని లీక్-ప్రూఫ్ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచాలి. అలాగే ఆ బ్యాగును 1 శాతం హైపోక్లోరైట్తో శుభ్రపరచాలి.
- రోగి కోసం వాడిన వస్త్రాలన్నింటినీ బయోహజార్డ్ బ్యాగ్లో ఉంచాలి.
- వ్యక్తి మరణించిన ఏకాంత గదిలో నేల, మంచం, రెయిలింగ్స్, పక్క టేబుళ్లు, స్టాండ్లన్నింటినీ 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.
- ఎట్టిపరిస్థితుల్లోనూ మృతదేహానికి ఎంబామింగ్ చేయడానికి అనుమతివ్వకూడదు.
శవపరీక్ష లేకుండా...