ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు

By

Published : Jul 4, 2020, 2:01 PM IST

Updated : Jul 4, 2020, 2:54 PM IST

రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు

13:59 July 04

17,699కి చేరిన కరోనా కేసుల సంఖ్య

రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రం‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,962 మంది నమూనాలు పరీక్షించగా 765 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిలో విదేశాలకు చెందిన 6, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 32 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 727 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 17,699 కేసులు నమోదయ్యాయి. 

కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 218 చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 8008కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 9473 మంది చికిత్స పొందుతున్నారు. 

Last Updated : Jul 4, 2020, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details