ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బోటు ప్రమాద స్థలాన్ని నేడు పరిశీలించనున్న సీఎం జగన్‌

దేవీపట్నం ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ సంఘటనా స్థలానికి ఇవాళ వెళ్లనున్నారు. విహంగవీక్షణం ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

By

Published : Sep 15, 2019, 10:19 PM IST

Updated : Sep 16, 2019, 1:27 AM IST

ఘటనా స్థలాన్ని సందర్శించనున్న సీఎం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు. ప్రమాద స్థలికి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకోనున్న సీఎం జగన్... ఆ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. ఆ తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయం వద్ద అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడనున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇదీ చూడండి:

Last Updated : Sep 16, 2019, 1:27 AM IST

ABOUT THE AUTHOR

...view details