ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2020, 8:12 PM IST

ETV Bharat / city

'వైఎస్​ఆర్ పింఛను కానుక' పథకంపై సీఎం సమీక్ష

'వైఎస్​ఆర్ పింఛను కానుక' పథకంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సిబ్బందికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

Cm jagan Reviews Pension Disbursement
Cm jagan Reviews Pension Disbursement

'వైఎస్ఆర్ పింఛను కానుక' పథకంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పథకంలో భాగంగా గడప వద్దకే పింఛన్ల పంపిణీ తీరుపై అధికారులతో చర్చించారు. లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. పాలనలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం అన్నారు. ఇంకా అర్హులు ఉంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారని పేర్కొన్నారు.

సీఎం జగన్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details