ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CID: భూక్రయవిక్రయాలపై రెండున్నర గంటలు సీఐడీ విచారణ

రాజధాని గ్రామమైన ఉద్ధండరాయునిపాలేనికి చెందిన ఎస్సీ రైతు పోల రవి.. సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. అసైన్డ్ భూములు అమ్మకాలకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ అధికారులు భూముల అమ్మకాలు, సాక్షి సంతకాల విషయంపై పలు ప్రశ్నలు అడిగారు. తన స్థలం కొన్నవారిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడి తెస్తున్నారని పోల రవి ఆరోపించారు.

By

Published : Jul 14, 2021, 8:16 PM IST

Updated : Jul 14, 2021, 9:42 PM IST

cid questioned farmer ravi
భూ క్రయవిక్రయాలపై ప్రశ్నలు

గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంకు చెందిన రైతు పోల రవికుమార్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రవికుమార్​ను సీఐడి(CID) అధికారులు ప్రశ్నించారు. మంగళగిరి సీఐడి ప్రధాన కార్యాలయంలో రెండున్నర గంటల పాటు ఈ విచారణ జరిగింది.

భూక్రయవిక్రయాలపై సీఐడీ విచారణను వివరిస్తున్న రైతు రవి..

ప్రశ్నల వర్షం..

ఎంత స్థలం విక్రయించావు..? ఎంతమందికి షూరిటీ సంతకాలు చేశావు..? స్థలం విక్రయం ఎవరు చేయమన్నారు..? అని సీఐడీ అధికారులు అడిగారని విచారణకు హాజరైన రైతు రవి తెలిపాడు. ఇష్టపూర్వకంగానే భూమిని విక్రయించానని అధికారులకు తెలిపాడు. ఇటీవల విజయవాడ సీఐడీ కార్యాలయంలో పోల రవిని అధికారులు విచారించారు. ఈరోజు మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో అధికారులు ముందు హాజరైనట్లు తెలుస్తోంది. స్థలం కొన్నవారిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడి తెస్తున్నారని పోల రవి ఆరోపించారు.

పోలా రవికి సీఐడీ నోటీసులు.. ఎందుకంటే

రాజధాని ప్రాంతంలోని తన అసైన్డ్‌ భూమిని ఎవరూ బలవంతంగా తీసుకోలేదని.. తానే స్వచ్ఛందంగా అమ్ముకున్నానని వెల్లడించిన ఉద్ధండరాయునిపాలేనికి చెందిన ఎస్సీ రైతు పోల రవికి సీఐడీ అధికారులు సోమవారం రోజు నోటీసులిచ్చారు. సీఆర్‌పీసీలోని 160 సెక్షన్‌ ప్రకారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నోటీసు జారీ చేశారు.

సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎ. లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసు ఇచ్చారు. ‘‘ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌విత్‌ 34, 35, 36, 37 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌)(జీ), ఏపీ అసైన్డ్‌ భూములు బదలాయింపు నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం సీఐడీ క్రైమ్‌ నెంబర్‌ 05/2021ను గతంలో నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం సాగుతోంది. దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు మీకు తెలిసి ఉంటాయని భావిస్తున్నాం. అసైన్డ్‌ భూముల బదలాయింపునకు సంబంధించిన కొన్ని పత్రాలపై మీరు సాక్షిగా కూడా సంతకాలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ ఎదుట హాజరుకాగలరని’’ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోలా రవి సీఐడీ విచారణకు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

మతిమరుపా? అయితే జాగ్రత్త పడాల్సిందే!

సర్పంచ్‌ అధికారాలను లాక్కునేందుకు యత్నిస్తున్నారు: లోకేశ్​

Last Updated : Jul 14, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details