ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో కొత్తగా 978 కరోనా కేసులు...4 మరణాలు

By

Published : Oct 25, 2020, 10:31 AM IST

తెలంగాణలో కొత్తగా 978 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి.. నలుగురు చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

corona cases tg
corona cacorona cases tgses tg

తెలంగాణలో కొత్తగా 978 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ బారినపడిన వారి సంఖ్య 2,31,252కు చేరింది. తాజాగా నలుగురు చనిపోగా... మొత్తం మృతుల సంఖ్య 1,307కి చేరింది. కరోనా నుంచి మరో 1,446 మంది కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 2,10,480కి చేరింది.

రాష్ట్రంలో 19,465 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 16,430 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 185 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 89, మేడ్చల్‌ జిల్లాలో 86 కేసులు వెలుగుచూశాయి.

ABOUT THE AUTHOR

...view details