ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

ఈ పండుగకు కారు కొనే ఆలోచనలో చేస్తున్నారా?

పండుగ సీజన్​, ప్రభుత్వ ఉద్దీపనలను అందిపుచ్చుకుని అమ్మకాలు పెంచుకోవాలని ఆటోమొబైల్​ సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఈ బాటలోనే మరిన్ని సంస్థలు త్వరలో ఆఫర్లు తీసుకువస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

By

Published : Sep 26, 2019, 5:19 PM IST

car sales

పండుగ సీజన్ నేపథ్యంలో వాహనాల అమ్మకాలు పెంచుకునే దిశగా ప్రణాళిక వేస్తున్నాయి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు. మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు కార్పొరేట్​ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్దీపన సానుకూలతలను అందిపుచ్చుకోవాలని వాహన సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కార్పొరేట్ సుంకాల కోతతో.. వాహనాల అమ్మకాలు పెరుగుతాయా అన్న సందిగ్ధం ఆటోమొబైల్​ సంస్థల్లో ఉంది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇటీవల వాహన అమ్మకాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు జీఎస్టీ తగ్గించాలని కేంద్రానికి విన్నవించాయి ఆటో మొబైల్ సంస్థలు. వాహన తయారీ సంస్థల డిమాండును కేంద్రం పక్కన పెట్టింది.

ప్రస్తుతం ఆఫర్లు ప్రకటించి.. వినియోగదారులను ఆకర్షించే వరుసలో మారుతీ సుజుకీ ముందుంది. ఈ సంస్థ ఇప్పటికే.. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్​ డీజిల్​, సెలెరియో, బలెనో డీజిల్​, ఇగ్నీస్​, డిజైర్​ డిజిల్​, టూర్​ ఎస్​ డీజిల్​లపై సహా ఎక్కువగా అమ్ముడయ్యే మోడళ్లపై రూ.5,000 ధర తగ్గించింది. తగ్గిన ధరలు తక్షణమే అందుబాటులోకి వస్తాయని.. ప్రస్తుతమున్న ఆఫర్లకు ఇది అదనమని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. ఈ తగ్గింపుతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని మారుతీ ఆశాభావం వ్యక్తం చేసింది.

మారుతీతో పాటు పియాజ్జియో ఇండియా, ఇసూజూ మోటార్స్​ ఇండియా పండుగ సీజన్​ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.

అమ్మకాలు పెరిగేందుకు మరిన్ని అవకాశాలు...

ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ గత నెల పలు ఉద్దీపనలు తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ విభాగాలు... వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధం ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2020 మార్చి వరకు వాహనాలపై 15 శాతం అదనపు తరుగుదలను ప్రకటించారు సీతారామన్​. ఈ సానుకూలతలూ.. అమ్మకాల వృద్ధికి ప్రోత్సాహమందిస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చూడండి: క్రెడిట్​ కార్డ్​పై పెట్రోల్​ రాయితీ ఇక కట్​

ABOUT THE AUTHOR

...view details