అసలు కేసు దేని గురించి..?
రెండో రోజూ వాద్రాపై ప్రశ్నల వర్షం...
హవాలా కేసు విచారణకు వరుసగా రెండో రోజూ ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు వాద్రాను ఈడీ ప్రశ్నించింది.
రెండో రోజూ ఈడీ విచారణకు వాద్రా
రాబర్ట్ వాద్రా లండన్లో 1.9మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారన్నది ఆరోపణ. ఇందుకోసం అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది.
అక్రమాస్తుల కేసులో గతవారం వాద్రాకు దిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మొదటి సారి దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హజరయ్యారు వాద్రా.
Last Updated : Feb 7, 2019, 3:20 PM IST