ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మళ్లీ రాజుకున్న రఫేల్​ రగడ

రఫేల్​ యుద్ధవిమానాల ఒప్పందం వివాదం మళ్లీ రాజుకుంది. రాహుల్​ గాంధీ ప్రధానిని చౌకీదార్​ చోర్​ హై అని ధ్వజమెత్తారు. మరోవైపు రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని మాజీ భారత రక్షణ కార్యదర్శి జి.మోహన్​కుమార్ ఆరోపించారు.

By

Published : Feb 8, 2019, 8:09 PM IST

rafeal


రఫేల్​ యుద్ధవిమానాల ఒప్పందం వివాదం మళ్లీ రాజుకుంది. తాజాగా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మరోసారి రఫేల్​ ఒప్పందం ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. చౌకీదార్​ చోర్​ హై అని ధ్వజమెత్తారు. ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపిందని ఆరోపించారు.

మరోవైపు రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని మాజీ భారత రక్షణ కార్యదర్శి జి.మోహన్​కుమార్ ఆరోపించారు.

రఫేల్​ వివాదంపై తాజాగా రాహుల్​ గాంధీ మోదీని, కేంద్రాన్ని విమర్శించిన కాసేపటికే మోహన్​ కుమార్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఫ్రాన్స్​ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుందని, రక్షణ శాఖను సంప్రదించకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారాయన.

మాజీ భారత రక్షణ కార్యదర్శి జి.మోహన్​కుమార్

భారత సార్వభౌమధికారంపై ఫ్రాన్స్​ నుంచి లేఖ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తీసుకోలేదని భారత మాజీ రక్షణ కార్యదర్శి జి. మోహన్​ కుమార్​ ఆరోపించారు. యుద్ధ విమానాల ఒప్పందాల ఖర్చు గురించి ప్రధాని కార్యాలయం చూసుకుంటే అభ్యంతరం లేదు కానీ.. మిగిలిన విషయాల పట్ల రక్షణశాఖ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందన్నారు మోహన్. 2015 నుంచి 2017 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు మోహన్​ కుమార్.

రక్షణ శాఖ లేఖ

రక్షణ అధికారుల అభ్యంతరాలపై అప్పట్లో రక్షణ మంత్రి మనోహర్​ పారికర్ వివరణ లేఖ రాసారు. ఈ సమాంతర చర్చలు ప్రధాని కార్యాలయ జాయింట్​ సెక్రటరీ జావేద్​ అష్రాఫ్, ఫ్రాన్స్​ దౌత్యాధికారి లూయిస్​ వాసీ​ మధ్య 2015 అక్టోబర్​ 20న జరిగినట్లు తెలిపారు.

ప్రభుత్వానికి కాస్త ఊరట

ఫ్రాన్స్​ మాజీ ప్రధాని మానుయేల్​ వాల్స్ లేఖ

ఫ్రాన్స్​ మాజీ ప్రధాని మానుయేల్​ వాల్స్​ 2016 సెప్టెంబర్​ 8న భారత ప్రధానికి రాసిన లేఖ శుక్రవారం బయటపడింది. భారత సార్వభౌమాధికారంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ ప్రధాని లేఖ ప్రాధాన్యం సంతరించుకొంది. భారత్​లో రఫేల్​పై ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు ఇరు పక్షాల సమ్మతితోనే జరిగాయని ప్రధాని మోదీకి లేఖ రాసారు వాల్స్.

రాహుల్​ గాంధీ ఆరోపణల విడియో కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

For All Latest Updates

TAGGED:

rafeal

ABOUT THE AUTHOR

...view details