ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మూడో సారి ఈడీ విచారణకు వాద్రా...

అక్రమ నగదు చలామణీ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్​ వాద్రా మూడోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.

By

Published : Feb 9, 2019, 12:11 PM IST

మూడో సారి ఈడీ విచారణకు వాద్రా...

మూడో రోజూ ఈడీ విచారణకు వాద్రా...
అక్రమ నగదు చలామణీ ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్డ్​ వాద్రాపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులు విచారించిన ఈడీ నేడు మరోసారి విచారణకు హాజరవ్వాలని సూచించింది. ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న వాద్రాపై అధికారులు ప్రశ్నల జల్లు కురిపిస్తున్నారు.

బుధవారం తొలిసారి విచారణకు హాజరైన వాద్రాను సుమారు ఐదున్నర గంటలపాటు ప్రశ్నించింది. గురువారం సుదీర్ఘంగా 9 గంటలపాటు ప్రశ్నించింది.

మధ్య దిల్లీలోని జామ్​నగర్​లోని కార్యాలయానికి ఈ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు వాద్రా చేరుకున్నారు. ముఖ్యంగా సంజయ్​ భండారితో వాద్రా సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 12న మరోసారి జైపుర్​లో వేరే కేసుకు సంబంధించి ఈడీ విచారణకు వాద్రా హాజరయ్యే అవకాశముంది.

వాద్రా గత విచారణలో కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. మరింత లోతుగా ఆరా తీసేందుకు అధికారులు మళ్లీ విచారణకు పిలిచారు.

ABOUT THE AUTHOR

...view details