''మీడియా వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకుపర్యవేక్షకకమిటీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.కోడ్ ఉల్లంఘనను నిశితంగా పరిశీలిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలనునిశితంగా పరిశీలిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యకు పాల్పడినా... కఠిన చర్యలకు సిద్ధమైమైంది.అవసరమైతేసుమోటోగా కేసులు నమోదు చేసేందుకు నిర్ణయించింది'' - గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన సందర్భాల్లో..ఇప్పటివరకు రాజకీయపార్టీలకు 89 నోటీసులు జారీ చేఅయినట్టు ద్వివేదిచెప్పారు. తెలుగుదేశానికి 48, వైకాపాకు 30, జనసేనకి 11 నోటీసులు పంపామని తెలిపారు. సోషల్ మీడియా ఐపీసీ సెక్షన్ 153 ఏ అతిక్రమిస్తే మూడేళ్ళ జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు కోడ్ ఉల్లంఘించకుండా సహకరించాలని కోరారు. నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు వచ్చాయని... లోక్సభ స్థానాలకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదని తెలిపారు. ఈ నెల 25 నుంచి అభ్యర్ధుల వారీగా పరిశీలన ఉంటుందని చెప్పారు. 23, 24 సెలవుల కారణంగా.. ఆ రెండురోజుల్లో నామినేషన్లు స్వీకరించమని పేర్కొన్నారు.
16 కోట్లు నగదు స్వాధీనం
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక... రాష్ట్రంలో ఇప్పటి వరకూ 16 కోట్ల రూపాయల నగదు సీజ్ చేశామని ద్వివేది చెప్పారు. ''చిత్తూరులో 6 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం.. వెండిని స్వాధీనం చేసుకున్నాం.నామినేషన్లకు ముందే ఎక్సైజ్ శాఖ 7కోట్ల 35 లక్షల విలువచేసే అక్రమమద్యాన్ని సీజ్ చేసింది. ఇప్పటి వరకు వివిధ అంశాలపై అందిన ఫిర్యాదుల్లో 79 శాతం చర్యలు తీసుకుని.. దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాం. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం'' అని ద్వివేది చెప్పారు.
లక్ష 55 వేల 99 ఓట్లు తొలగింపు