ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

నక్సలైటుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను

ఎన్​కౌంటర్​లో గాయపడ్డ నక్సలైట్​కు రక్తదానం చేసిన జవాను మానవత్వాన్ని చాటిచెప్పాడు.

By

Published : Feb 6, 2019, 5:30 PM IST

రక్తదానం చేస్తున్న జవాను

నక్సలైటుకు జవాను రక్తదానం
హత్య, కుట్ర, దోపిడీ... ప్రపంచంలో జరుగుతున్న అక్రమాల గురించి రోజూ వింటూనే ఉంటాం. వీటన్నిటి మధ్య మానవత్వం చాటిచెప్పే సంఘటనలూ ఉంటాయి. యుద్ధంలో ప్రత్యర్థిని మట్టికరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతారు జవాన్లు. కానీ యుద్ధక్షేత్రంలో శత్రువుపైనా మానవత్వం చాటి ఓ జవాను ప్రశంసలందుకుంటున్నాడు.

జార్ఖండ్​ ఎన్​కౌంటర్​లో తీవ్రంగా గాయపడ్డ ఓ నక్సలైట్​కు సీఆర్​పీఎఫ్​ జవాను తన రక్తం దానం చేసి మానవత్వం చాటిచెప్పాడు. పశ్చిమ సింఘ్​భమ్​ జిల్లా- ఖుంటి సరిహద్దులో జనవరి 29న ఎన్ కౌంటర్​ జరిగింది. కోబ్రా అనే ప్రత్యేక భద్రతాదళం ఐదుగురు మావోయిస్టులను మట్టుబెట్టింది. నెత్తుటి మరకల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ నక్సల్​ను, జవాన్లు వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజ్​కమల్​ అనే జవాను తన రక్తాన్ని దానం చేశాడు.

"జవాను రక్తదానం చేశాడు. ఉగ్రవాదిని కాపాడటానికి ఆయన రక్తదానం చేశాడు. తన జీవితంలోనే గొప్ప పని చేశాడాయన. ఇలాంటి వ్యక్తికి మేము సెల్యూట్​ చేస్తాము. తనపై తుపాకీ ఎక్కుపెట్టిన నక్సలైట్​కే ఇతను రక్తదానం చేశాడు."
--- కొమలేంద్ర కుమార్​, వైద్యుడు.

ABOUT THE AUTHOR

...view details