By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 2:23 PM IST
రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల
YS Sharmila Paid Tribute to Media Mogul Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావుకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటం వద్ద వైఎస్ షర్మిల అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు (Ramoji Rao) సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి షర్మిల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.