విజయవాడలో వివాహిత మృతి - కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు అనుమానం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 10:35 PM IST
Women Suspect Death in Vijayawada: విజయవాడ నగర శివారులోని రాజీవ్ నగర్ వడ్డెర కాలనీలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె నివాసం ఉండే ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన మహిళ వేమూల గురవమ్మగా స్ధానికులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని మృతురాలి కుటుంబీకులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమెకు ఉరి వేసుకోవడానికి గల కారణాల కోసం స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి చెందడంతో గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.