national

నిజామాబాద్​లో రామోజీరావుకు నివాళులర్పించిన రామోజీ సంస్థల ఉద్యోగులు

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 3:05 PM IST

Tribute to Ramoji Rao
Tribute to Ramoji Rao (ETV Bharat)

Tribute to Ramoji Rao : నిజామాబాద్​లో రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఆ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఘన నివాళి అర్పించారు. నిజామాబాద్ యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల నుంచి వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్ర పటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వృత్తిపట్ల అంకిత భావంతో ఎలా మెదగాలి అనేది ఆయన్ను చూసి నేర్చుకున్నట్లు రామోజీ సంస్థల ఉద్యోగులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details