Rape Attempt In Miyapur : మహిళల భద్రత కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు అత్యాచారం చేయబోయారు.
మియాపూర్లోని యువతిపై అత్యాచారయత్నం - కేసు నమోదు చేసిన పోలీసులు
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 3, 2024, 3:54 PM IST
![మియాపూర్లోని యువతిపై అత్యాచారయత్నం - కేసు నమోదు చేసిన పోలీసులు Miyapur Rape Attempt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21858894-thumbnail-16x9-rape-attempt.jpg?imwidth=3840)
ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్కు వచ్చిన యువతి ఉప్పల్లో నివాసం ఉంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్లు యువతికి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లారు. సైట్కు వెళ్లిన యువతిపై ఇద్దరూ కలిసి అత్యాచారానికి యత్నించారు. వారిని ప్రతిఘటించిన యువతి అక్కడ నుంచి తప్పించుకొని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు కేసును మియాపూర్ స్టేషన్కు బదిలీ చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Rape Attempt In Miyapur : మహిళల భద్రత కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు అత్యాచారం చేయబోయారు.
ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్కు వచ్చిన యువతి ఉప్పల్లో నివాసం ఉంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్లు యువతికి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లారు. సైట్కు వెళ్లిన యువతిపై ఇద్దరూ కలిసి అత్యాచారానికి యత్నించారు. వారిని ప్రతిఘటించిన యువతి అక్కడ నుంచి తప్పించుకొని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు కేసును మియాపూర్ స్టేషన్కు బదిలీ చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.