రైల్ రోకో కేసులో కేసీఆర్కు హైకోర్టులో ఊరట
Published : Jun 25, 2024, 1:20 PM IST
Ex CM KCR Rail Roko Case Postponed To July 2024 :రైల్ రోకో కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు విచారణపై స్టే విధిస్తూ విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2011లో రైల్రోకోకు పిలుపునిచ్చారని కేసీఆర్పై మల్కాజిగిరి పోలీసులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసు కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ వేశారు.