అమరావతిలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ పర్యటన - అనంతరం చంద్రబాబుతో భేటీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 9:42 AM IST
Telangana Governor Radhakrishnan will Meet AP Chief Minister Nara Chandrababu Naidu : తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ మర్యాద పూర్వకమే అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ గవర్నర్తో విభజన సమస్యల ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ కొన్ని విభజన సమస్యలు పెండింగ్లోనే ఉన్న విషయం తెలిసిందే.