national

ఏపీ సీఎం చంద్రబాబుతో గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ - ఆ అంశాలపై చర్చ!

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 12:41 PM IST

Telangana Governor CP Radhakrishnan Meets AP CM CBN
Telangana Governor CP Radhakrishnan Meets AP CM CBN (ETV Bharat)

Telangana Governor CP Radhakrishnan Meets AP CM CBN :ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

అంతకు ముందు గవర్నర్‌కు మంత్రి లోకేశ్ స్వాగతం పలికి మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ విభజన చట్టాలపై చర్చలతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details