national

ETV Bharat / snippets

నేడు విజయవాడకు సీఎం రేవంత్ - వైఎస్సార్ జయంతి సభకు హాజరు

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 7:21 AM IST

YS Birth Anniversary celebrations
Telangana CM Revanth Reddy AP Tour (ETV Bharat)

Telangana CM Revanth Reddy AP Tour: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. అంతకుముందు ఉదయం పూట పంజాగుట్ట సర్కిల్‌లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులుస, కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details