కుమార్తెలకు పురుగుల మందు తాగించి - తానూ సేవించి తల్లి ఆత్మహత్యాయత్నం
Published : Jul 1, 2024, 10:03 PM IST
![కుమార్తెలకు పురుగుల మందు తాగించి - తానూ సేవించి తల్లి ఆత్మహత్యాయత్నం Four people attempted suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/1200-675-21844221-thumbnail-16x9-family-suicide-attempt.jpg)
Mother Daughters Suicide Attempt :కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గజ్జిగడలో తల్లీ, ముగ్గురు కుమార్తెలు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కుటుంబ కలహాలతో ఆ నలుగురు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం గమనించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేకనే బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.