Chandrababu House Attack Case : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవ్వరూ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వారు సహకరించనందున వీరికి ఇచ్చిన రక్షణను తొలగించాలని అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈరోజు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ను మంగళగిరి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీకృష్ణ సుమారు రెండు గంటల పాటు విచారించారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
"27 ప్రశ్నలకు ఒక్క సమాధానం లేదు" - చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో దర్యాప్తునకు సహకరించని జోగి రమేశ్
Chandrababu House Attack Case (ETV Bharat)
జోగి రమేశ్ను దాదాపు 27 రకాల ప్రశ్నలను అడిగామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. దేనికీ ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికీ నిందితులు సెల్ఫోన్లు సమర్పించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మురళీకృష్ణ వెల్లడించారు.