అధికారుల నిర్లక్ష్యం- ఆడుకుంటున్న విద్యార్థులపై పడ్డ విద్యుత్ స్తంభాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 3:55 PM IST
Four Students Were Injured in a School in YSR District Due to Falling Electric Poles : వైయస్సార్ జిల్లా అట్లూరు మండలం కామసముద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బయట నిలువ ఉంచిన విద్యుత్ స్తంభాలు పడి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ లైన్ పునరుద్ధరణలో భాగంగా పాఠశాల బయట విద్యుత్ స్తంభాలను పెట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలో గోడ కూలి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి మృత్యువాత పడిన సంగతి తెలిసింది.