national

'దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పింఛన్ల పంపిణీ- 18రోజుల్లోనే హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 3:53 PM IST

Former Minister KS Jawahar Responded on Distribution of Pensions in AP
Former Minister KS Jawahar Responded on Distribution of Pensions in AP (ETV Bharat)

Former Minister KS Jawahar Responded on Distribution of Pensions in AP : దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్ల పంపిణీ జరిగిందని మాజీమంత్రి కె.ఎస్‌.జవహర్‌ అన్నారు. ఇచ్చిన హామీని 18 రోజుల్లోనే అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్‌కు తగిలిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు మార్క్ చూపేలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. ఒక నాయకుడికి, నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులా పరుగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్‌ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details