డిప్యుటేషన్ అధికారులను రిలీవ్ చేసిన ఈసీ- మాతృశాఖకు అప్పగిస్తూ సీఈవో ఆదేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 3:30 PM IST
![డిప్యుటేషన్ అధికారులను రిలీవ్ చేసిన ఈసీ- మాతృశాఖకు అప్పగిస్తూ సీఈవో ఆదేశం Deputation Officers Releived from AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/1200-675-21849597-thumbnail-16x9-deputation-officers-releived-from-ap.jpg)
Deputation Officers Releived from AP: ఎన్నికల విధుల్లో భాగంగా డిప్యుటేషన్పై వచ్చిన అధికారులను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ చేశారు. ఆయా అధికారులను వారి మాతృ శాఖలకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 27 మంది అధికారులను ఇవాళ్టి నుంచి రిలీవ్ చేస్తునట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులిచ్చారు. కాగా ఎన్నికల సమయంలో విధులు నిర్వహించేందుకు పలువురు అధికారులు డిప్యుటేషన్పై వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వారిని రిలీవ్ చేశారు.