Clash in Yellandu Municipal Council meeting :ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్మెన్ జానీ పాషా మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువురు మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ అభివృద్ధి పనుల విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో, తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసా- నాయకుల తోపులాట
Published : Jun 29, 2024, 5:17 PM IST
![ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసా- నాయకుల తోపులాట CLASH IN YELLANDU MUNICIPAL MEET](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/1200-675-21826787-thumbnail-16x9-yellandu-fight.jpg)
Clash in Yellandu Municipal Council meeting (ETV Bharat)
కార్మికుల సమస్యల పరిష్కారంపై ఇరువురు నేతలు ఐక్యత రాగం వినిపించారు. తర్వాత మొదలైన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఇరువురి మధ్య వాడి వేడి చర్చలతో వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.