Car Accident In Nalgonda District : నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుంటూరు వైపు వెళ్తుండగా హనుమాన్ పేట ఫ్లై ఓవర్పై నల్గొండ వైపు వెళ్తున్న ఓ కారు ఢీకొట్టింది.
మిర్యాలగూడలో ఫ్లైఓవర్పై ఢీకొన్న రెండు కార్లు - ఒకరికి తీవ్ర గాయాలు
Published : Jun 6, 2024, 3:47 PM IST
Car Accident In Nalgonda District (ETV Bharat)
దీంతో రెండు కార్లు ముందుభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగే సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.