AP CS Neerabh Kumar Prasad Tenure Extended :ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి 2024 డిసెంబరు 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తున్నట్లుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ సర్వీస్ పొడిగింపు - AP CS SERVICE EXTEND
Published : Jun 27, 2024, 2:40 PM IST
![ఏపీ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ సర్వీస్ పొడిగింపు - AP CS SERVICE EXTEND AP CS Neerabh Kumar Prasad Tenure Extended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-06-2024/1200-675-21808745-thumbnail-16x9-ap-cs.jpg)
AP CS Neerabh Kumar Prasad Tenure Extended
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎస్ నీరబ్ కుమార్ సర్వీసును పొడిగిస్తున్నట్లుగా డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. వాస్తవానికి ఆయన జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. సర్వీసు పొడిగింపు ఉత్తర్వులతో మరో ఆరు నెలల పాటు ఆయన సీఎస్గా కొనసాగనున్నారు.