national

ఏపీ అసెంబ్లీ స్పీకర్​గా అయ్యన్నపాత్రుడు - ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 11:30 AM IST

Andhra Pradesh Speaker 2024
AP Speaker Ayyanna patradu (ETV Bharat)

Andhra Pradesh Speaker Elected 2024: ఆంధ్రప్రదేశ్​ 16వ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్‌, మంత్రి అచ్చెన్నాయుడు సభాపతి స్థానంలో కూర్చోపెట్టారు.

దీంతో నూతన స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలుపొందారు.

ABOUT THE AUTHOR

...view details