8 Months Baby Dies of Snake Bite in Mancherial :పాము కాటుకు 8నెలల పసికందు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో చోటుచేసుకుంది. హాయిగా నిద్రిస్తున్న బాలుడిని పాము కాటు వేయడం గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు.
హాయిగా నిద్రిస్తున్న చిన్నారికి పాము కాటు - ఆరు రోజులు ప్రాణాలతో పోరాడి చివరకు?
Published : Jul 8, 2024, 2:50 PM IST
మందమర్రిలో జీవన్ కుమార్ - కీర్తీ దంపతులకు 8 నెలల బాలుడు ఉన్నాడు. ఈ నెల 2వ తేదీన రాత్రి ఇంట్లో నేలపై నిద్రిస్తున్న సమయంలో బాలుడు గట్టిగా ఏడ్చాడు. ఏమైందో చూడగా అతడిని పాము కాటు వేయడం గుర్తించారు. వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి నుంచి మైరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆరు రోజుల నుంచి చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు. పసికందు మృతితో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.