By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 7:40 AM IST
తిరుమల ప్రాణదాన ట్రస్ట్కు రూ.21 కోట్లు విరాళం
21 Crores Donation to TTD Pranadana Trust: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న ప్రాణదాన ట్రస్ట్కు రూ. 21 కోట్ల భారీ విరాళం అందింది. పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజిందర్ గుప్తా ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.21 కోట్లు విరాళంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న దాత చెక్కును అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. టీటీడీ చేస్తున్న సేవలకు చేయూతగా విరాళం అందజేసినట్లు రాజిందర్ గుప్తా తెలిపారు.